హైదరాబాద్ లో కిడ్నాప్ వ్యవహారంలో అనంతపురం పోలీసులు చాలా సమర్ధవంతంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అనంతపురం పోలీసులను అభినందించిన డిజిపి గౌతం సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. పోలీసుల అప్రమత్తతో సకాలంలో స్పందించారు అని ఆయన అన్నారు.  కిడ్నాపర్ల చెర నుండి  వైద్యుడి ప్రాణాలను కాపాడిన అనంతపురం పోలీసులు సాహసం చేసారని అన్నారు.

ఇలాంటి నేరాలను అరికట్టడంతో ప్రజలకు పోలీసుల పైన దృఢమైన నమ్మకం, భరోసా కలుగుతుంది అని ఆయన అన్నారు. నేరాల నియంత్రణలో ఎపి పోలీసుల పనితీరుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ అన్నారు ఆయన. ప్రజల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు నిరంతరం శ్రమిస్తూనే  ఉంటారు అని ఆయన తెలిపారు. కాగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఒక డాక్టర్ ని డిమాండ్ చేసి దాదాపుగా పది కోట్ల వరకు డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: