ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్ట్ టార్గెట్ గా ఇప్పుడు విపక్షాలు తీవ్ర స్థాయిలో అధికార పార్టీ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేసి విమర్శలు చేసారు. చంద్రబాబు అవినీతి, కమీషన్ల కక్కుర్తి ఏపీకి శాపాలుగా మారాయి అని ఆయన ఆరోపణలు చేసారు. పోలవరంలో కమీషన్ల కోసం అప్పట్లో కేంద్రం పెట్టిన షరతులను అంగీకరించాడు అని మండిపడ్డారు.

పోలవరం ను ఏటీఎంలా వాడుకున్నాడని సాక్షాత్తు ప్రధానే ఆవేదన వ్యక్తం చేశారు అని చంద్రబాబు నాయుడు చేసిన పాపాలను  సిఎం వైఎస్ జగన్  గారు ప్రక్షాళన చేస్తూ వ్యవస్థను గాడిలో పెడుతున్నారు అని ఆయన ఆరోపించారు. ఇక ఇదిలా ఉంటే టీడీపీ హయాంలో 55 వేల కోట్లకు కేంద్రం అంగీకారం తెలిపి ఇప్పుడు మళ్ళీ 20 వేల కోట్లే ఇస్తామని చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: