దుబ్బాకలో 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాం అని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేసారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతే హరీష్ రావు మంత్రి పదవి పోయి కవిత మంత్రి అవుతుంది అని ఆయన అన్నారు. అందుకే హరీష్ రావు బాగా కష్టపడుతున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రఘునందన్ రావు ప్రజల మనిషి కాబట్టే సిద్దిపేటలో డబ్బులు పట్టుబడితే ప్రజలకు సపోర్టు చేయడానికి వచ్చారు అని ఆయన తెలిపారు.

హరీష్ రావు పోలీసుల చేత రఘునందన్ రావు బంధువులు  ఇళ్ల పై దాడులు చేయిస్తున్నారు మండిపడ్డారు. సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ పై బీసీ కమిషన్ సుమోటోగా స్పందించింది అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే జోయల్ డేవిస్ బీసీ కమిషన్ ముందు చేతులు కట్టుకుని నిలబడటం ఖాయం అని స్పష్టం చేసారు. బీజేపీ వ్యవహరాలతో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఏం సంబంధం  అని ప్రశ్నించారు. ఆయన పని ఆయన చూసుకోవాలని అన్నారు. గాంధీభవన్ కు జీతాలు కేసీఆర్, రామేశ్వర్ రావులు ఇస్తారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: