రైతులకు బేడీలు వేయడంపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహంగా ఉంది. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అధికార పార్టీ అహంకారం పరాకాష్టకు చేరిందని ఆయన ఆరోపించారు. అధికారం ఇచ్చిన దళితులపైనే దాడులు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. దళితుల రక్షణ కోసం తెచ్చిన చట్టాన్ని దళితుల పైనే ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు.

దేశంలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి వెనక్కు తీసుకున్నా.. పోలీసులు కేసు నమోదు చేయటం దారుణం అన్నారు. రైతులను బేడీలు వేసి తీసుకు వస్తారా అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వారిని బెదిరించేందుకు  అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ఓట్లు వేసిన దళితులపై జగన్ పగ తీర్చుకుంటున్నారు అని ఆయన ఆరోపించారు. రైతులకు వేసిన సంకెళ్లు మీ ప్రభుత్వానికి ఉరి తాళ్లు అవుతాయని హెచ్చరిస్తున్నా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: