బిజెపి ఎంపి రమేష్ బిధురి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ను దేశ రాజధాని ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. జూలై 2017 న న్యూస్ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిఎం తనను క్రిమినల్‌ గా పేర్కొంటూ పరువు నష్టం కలిగించే ప్రకటన చేశారని బిధూరి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్ట్ లో పరువు నష్టం దావా వేసారు.

ఇక ఈ వ్యాఖ్యలు అప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఎంపీ రమేష్ అయితే సిఎం క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్  కూడా చేసారు. అయినా సరే అరవింద్ కేజ్రివాల్ మాత్రం క్షమాపణ చెప్పడానికి ఆసక్తి చూపించలేదు. దీనిపై ఆయనపై ఢిల్లీ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసి తనకు పరువు నష్టం చెల్లించాలి అని ఆయన డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: