కరోనా బారినపడుతున్న ప్రముఖులు, రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనను ఇటీవల కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.'గో కరోనా.. గో' ఉపదేశంతో దేశమంతా వార్తల్లోకెక్కిన కేంద్ర సామాజికన్యాయ శాఖ సహాయమంత్రి రాందాస్ అఠవాలే(60)కు మంగళవారం కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం దక్షిణ ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు.


రాజ్యసభ సభ్యుడైన అరవాలేకు చక్కెరవ్యాధి కూడా ఉన్నట్టు ఆయన సహాయకుడు తెలిపారు. సినీనటి పాయల్ ఘోష్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన సందర్భంగా సోమవారం ముంబయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: