జమ్ముకశ్మీర్​ బుద్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. బుద్గాం జిల్లాలోని హరిబాగ్​ మౌచ్వా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు మంగళవారం రాత్రి 9గంటల సమయంలో భద్రతాదళాలు, పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. ఈ పరిణామాలు ఎన్​కౌంటర్​కు దారితీశాయి.

సుమారు నాలుగు గంటల పాటు ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. ఇద్దరు తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అయితే ముష్కరులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉగ్రవాదుల్లో ఒకరు విదేశీయుడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.జమ్ముకశ్మీర్​ బుద్గాం జిల్లాలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. అయితే వీరి వివరాలపై ఎలాంటి స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: