స్వచ్ఛంద కార్యకలాపాల కోసం వినియోగించాల్సిన నిధులను వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు మళ్లిస్తున్న ఎన్​జీఓలు, ట్రస్ట్​లకు సంబంధించిన కేసులో.. జమ్ముకశ్మీర్​లోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది ఎన్​ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ). బెంగళూరులోనూ తనిఖీలు చేపట్టింది.ఈ సోదాల్లో నేరాన్ని రుజువు చేసే పత్రాలు, ఎలక్ట్రానిక్​ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్​ఐఏ వెల్లడించింది.


శ్రీనగర్​, బందిపొరలోని 10 ప్రాంతాలు, బెంగళూరులోని ఒక ప్రాంతంలో ఎన్​ఐఏ సోదాలు నిర్వహించింది. స్వచ్ఛంద కార్యకలాపాల పేరుతో దేశంతో పాటు విదేశాల్లో నిధులు సేకరిస్తున్న ఈ ఎన్​జీఓలు, ట్రస్ట్​లు అనంతరం వాటిని జమ్ముకశ్మీర్​లో వేర్పాటువాద పనుల కోసం వినియోగిస్తున్నారు. జేకే కొయిలేషన్​ ఆఫ్​ సివిల్​ సొసైటీ కోఆర్డినేటర్​ ఖుర్రమ్​ పర్వేజ్​, అతని సహచరుడు అహ్మద్​ బుఖారి, బెంగళూరుకు చెందిన జీకే ట్రస్ట్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: