ఆన్​లైన్ గేమ్​ పబ్​జీకి మరో ప్రాణం బలైంది. పబ్​జీ ఆడలేననే మనస్తాపంతో 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో జరిగింది.కోయంబత్తూర్​ జిల్లా సులుర్​కు చెందిన 14 ఏళ్ల బాలుడు చెన్నైలో 9వ తరగతి చదువుతున్నాడు. అతడికి తరచూ పబ్​జీ ఆడటం అలావాటు. ఈ విషయం గమనించిన తల్లిడండ్రులు ఎక్కువ సేపు గేమ్ ఆడటం మంచిది కాదని హెచ్చరించారు. అయినా వారి మాట లేక్కచేయకుండా పబ్​జీకి బానిసైపోయాడు ఆ బాలుడు.


అతడికి రెండు నెలల నుంచి మానసిక ఆస్పత్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు తల్లిండ్రులు. అయితే ఇకపై పబ్​జీ ఆడలేననే మనస్తాపానికి గురైన ఆ బాలుడు.. ఎవరూ లేని సమయం చూసి మంగళవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తల్లిడండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: