భారత్లోని లద్దాఖ్ ప్రాంతాన్ని చైనా భూభాగంగా చూపటంపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటోంది ట్విట్టర్. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ(సమాచార భద్రత) విచారణకు ఆదేశించింది. పార్లమెంటరీ సంయుక్త కమిటీ ముందు ట్విట్టర్ ప్రతినిధులు బుధవారం హాజరయ్యారు. లద్దాఖ్ను చైనాలో భాగంగా చూపటంపై పలు ప్రశ్నలు అడిగారు ప్యానల్ సభ్యులు. ఈ సందర్భంగా తమ సంస్థ భారతదేశ సున్నితమైన అంశాలను గౌరవిస్తుందని తెలిపారు ట్విట్టర్ ప్రతినిధులు.
ట్విట్టర్ వివరణ అసంపూర్ణంగా ఉందని పేర్కొన్నారు ప్యానల్ ఛైర్పర్సన్
మీనాక్షి లేఖీ. ఈ చర్య ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే నేరాలతో సమానమని తెలిపారు.లద్దాఖ్ను చైనాలో భాగంగా చూపటంపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని
ట్విట్టర్ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు మీనాక్షి.ట్విట్టర్ ప్రతినిధులతో పాటు ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక శాఖ, న్యాయ శాఖ అధికారులు పార్లమెంటరీ ప్యానల్ ముందు హాజరయ్యారు.