భారత్​తో సన్నిహిత సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. నావికాదళ అవరాలను తీర్చే విధంగా అధునాతన ఎఫ్​-18 నావికా యుద్ధవిమానాలను భారత్​కు విక్రయించేందుకు సిద్ధమైంది.ఐఎన్ఎస్ విక్రమాదిత్య, నిర్మాణంలో ఉన్న స్వదేశీ విమాన వాహక నౌక సహా మొత్తం 57 నావికాదళ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత నావికాదళం కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది.


భారత ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఇటీవల జరిగిన 'టూ ప్లస్ టూ' భేటీలో ఎఫ్​-18 యుద్ధవిమానాలను విక్రయించేందుకు అమెరికా సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల రక్షణ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.భారత నావికాదళం ప్రస్తుతం వినియోగిస్తున్న యుద్ధవిమానాలను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో తొలగించనున్నారు. అందుకే భవిష్యత్​ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్రాన్స్​ నుంచి రఫేల్ నావికాదళ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది భారత్. ఇప్పుడు అమెరికా నుంచి ఎఫ్-18 ఫైటర్ జెట్లను కొనుగోలు చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: