కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపై ఎలక్షన్​ కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది బిజేపి. ఈ మేరకు ఈసీకి రాసిన లేఖను విడుదల చేసింది. బిహార్​లో తొలిదశ పోలింగ్​ జరుగుతున్న నేపథ్యంలో.. రాహుల్​ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని అందులో పేర్కొంది.బిహార్​ అసెంబ్లీ తొలి విడత పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 33.10శాతం పోలింగ్​ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్​ శాఖ ఏర్పాట్లు చేసింది. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి ఫేజ్​ పోలింగ్​ ఈ నెల 28న జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రంతో మొదటి దఫా పోలింగ్​ జరిగే 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మొదటి ఫేజ్​లో ఆర్​జేడీ అత్యధికంగా 42 స్థానాల్లో బరిలోకి దిగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: