మిజోరంలో కరోనాతో మొట్టమొదటి మరణం నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. పది రోజులుగా వైరస్​తో పోరాడిన 62ఏళ్ల వ్యక్తి బుధవారం చనిపోయినట్లు తెలిపారు.మిజోరంలో మొదటి కేసును మార్చి 24న అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో వైరస్​ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పలు మార్లు పూర్తి స్థాయి లాక్​డౌన్​ అమలు చేశారు. మరికొన్ని సార్లు పాక్షికంగా విధించారు.


ఇప్పటివరకు మిజోరంలో మొత్తం కేసుల సంఖ్య 2,607గా ఉంది. బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి.మిజోరంలో కొవిడ్​ కారణంగా మొదటి మరణం నమోదైంది. ఇప్పటివరకు వైరస్​ కారణంగా ఒక్కరు కూడా మృతి చెందకపోగా బుధవారం ఓ వృద్ధుడు ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: