ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. ఆయన ప్రసంగాల్లో ఒక్కసారి కూడా నిరుద్యోగం అంశాన్ని ఎందుకు ప్రస్తావించరని మండిపడ్డారు. ఇతర దేశాల గురించి అనర్గలంగా మాట్లాడే మోదీ.. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి మాత్రం అసలు మాట్లాడరని ధ్వజమెత్తారు.బిహార్​లో రెండో దఫా ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ చంపారన్​ జిల్లాలోని వాల్మీకి నగర్​లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్​.

 ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్​ కుమార్​లపై విమర్శలు గుప్పించారు.విజయదశమి వేడుకల్లో భాగంగా పంజాబ్ రైతులు ప్రధాని దిష్టబొమ్మ దహనం చేయడం తనను బాధించిందని చెప్పారు రాహుల్. వ్యవసాయ చట్టాలపై రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలిపేందుకు ఇది నిదర్శనమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: