తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగాయి. రెండు రోజుల ముందు కరోనా కేసులు భారిగా తగ్గాయి. అయితే అప్పుడు టెస్ట్ లు బాగా తగ్గించడంతో బాగా కేసులు తగ్గాయి. కానీ మళ్ళీ టెస్ట్ లు పెంచడంతో మళ్ళీ కేసులు గట్టిగా నమోదు అవుతున్నాయి. నేడు మరోసారి కేసులు ఎక్కువగా నమోదు కావడం కంగారు పెడుతున్న అంశమని చెప్పచు. తెలంగాణలో నిన్న 1,504 కొత్త కేసులు నమోదు అయ్యాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.

1,436 రికవరీలు నిన్న నమోదు అయ్యాయి. ఇక మరణాల విషయంలో తెలంగాణా చాలా మెరుగ్గా ఉంది. 5 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 2,35,656కు చేరాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిలో 2,16,353 రికవరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 1324 మంది ప్రాణాలు కోల్పోయారు అని ప్రభుత్వం పేర్కొంది. యాక్టివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం 17,979 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: