ఆంధ్రప్రదేశ్ లో  విపక్ష తెలుగుదేశం పార్టీ చేసే అవినీతి విషయంలో అధికార పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉంది. రాజకీయంగా ఈ విమర్శలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టీడీపీ చేసిన అవినీతిపై విచారణ కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొన్ని సంచలన ఆరోపణలు చేసారు.

చంద్రబాబు అధికారంలో ఉంటే కోటాను కోట్ల లాభాలు, అధికారం పొతే నష్టాలు. ఏమిటో  ఈ  హెరిటేజ్  కిటుకు? అంటూ ఆయన ట్వీట్ చేసారు. అవినీతి డబ్బును  వైట్ మనీగా మార్చుకోడానికే   హెరిటేజ్ పెట్టాడా ? అంటూ ఆయన ట్విట్టర్లో ప్రశ్నించారు. తన స్వార్థం కోసం  పాడి రైతుల  ఆధ్వర్యంలో నడిచే  కో ఆపరేటివ్ డైరీలను  సర్వనాశనం చేశాడు - రైతులను భ్రష్టు పట్టించాడు. అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: