అమరావతి రైతులకు బేడీలు వేయడాన్ని తప్పుబడుతూ రాష్ట్ర డీజీపీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లేఖ రాశారు. సుప్రీమ్ కోర్టు అదేశాలు ధిక్కరిస్తూ రైతులకు బేడీలు వేయడం క్షమించరాని నేరమని డీజీపీకి లేఖలో తెలిపారు వర్ల. ముద్దాయిలైన రైతులు అందరికి తెలిసినవారే, పారిపోయే వాళ్లు కాదు, మరి బేడీలు ఎందుకు వేశారు? అని ఆయన ప్రశ్నించారు. ఎవరి అదేశాల మేరకు అమరావతి కోసం అదోళన చేస్తున్న రైతులకు బేడీలు వేశారు ? అమరావతి ఉద్యమాన్ని అణచడం కోసం.. రైతులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం బేడీలు వేశారా? అని ప్రశ్నించారు.

 ఎస్కార్డు సిబ్బందిని, రైతులకు బేడీలు వేయమని అదేశించిన ‘‘అజ్ఞాత వ్యక్తి’’ ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసు విచారణ అంతా తప్పుల తడకగా సాగింది. ఈ కేసు విచారణ అధికారి గత చరిత్ర దృష్ట్యా, మరో అధికారితో ఈ కేసు పునర్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన రవి కేసు వాపస్ తీసుకుంటానంటే, విచారణ అధికారి అతనిని ఎందుకు బెదిరించారు? అని ప్రశ్నించారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని పోలీసు గౌరవాన్ని కాపాడండని వర్ల రామయ్య లేఖ వ్రాసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: