ఆంధ్రప్రదేశ్ లో  ఇప్పుడు కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతుంది. ఎక్కడో ఒక చోట పోలీసులు వివాదాస్పదంగానే ప్రవర్తిస్తున్నారు. తాజాగా 40 మందికి పైగా రైతులకు చేతులకు బేడీలు వేసి తీసుకుని వెళ్ళిన ఘటన సంచలనం అయింది. గుంటూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఇక దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో టీడీపీ దీనికి సంబంధించి వినూత్న నిరసన తెలియజేసింది. పోలీసులు రాజధాని రైతుల కు సంకెళ్ళు వేయడానికి  నిరసిస్తూ ఎమ్మెల్యే గద్దె రాంమోహన్ ఆధ్వర్యంలో నిరసన చేసారు.  చేతుల కు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపిన గద్దె... రైతులును దళితులకు అవమానించి న వైకాపా ప్రభుత్వం తీరును నిరసిస్తూ నినాదాలు చేసారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరుసగా దీనిపై నిరసనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: