దేశంలో ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ప్రజలకు ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు గానూ కేంద్ర నిల్వలు (బఫర్​ స్టాక్​) నుంచి లక్ష టన్నుల ఉల్లిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​.మధ్యప్రదేశ్ ఇండోర్​ జిల్లా ధర్మపురిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు తోమర్​.


నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్​ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు తోమర్. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వ విధానాల ద్వారానే దేశంలో ఉల్లి ధరలు ఆకాశానంటుతున్నాయని ఆరోపించారు ఎన్​సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి శరద్​ పవార్​. వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై విధించిన నిషేధంపై కేంద్రంతో మాట్లాడనున్నట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: