పశ్చిమ్​బంగాలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతుడిని గైఘాటకు చెందిన రామకృష్ణ సర్కార్​(27)గా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు అధికారులు. అనుమానాస్పద రీతిలో మృతిచెందినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు.


భార్య వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. రామకృష్ణ భార్య స్వప్న సర్కార్​.. సుజిత్​ దాస్​ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుపుతన్నట్లు అనుమానించారు పోలీసులు. దీనికి తోడు సుజిత్​ నివాసంలోనే రామకృష్ణ మృతదేహం లభ్యమవడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వప్న, సుజిత్​లను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: