గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్​ పటేల్(92) గురువారం​ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్​లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఆసుపత్రిలో చేరారు. అయితే.. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికీ.. ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్య తీవ్రమవటం వల్ల ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.


1928 జులై 24న గుజరాత్​లోని విసవదార్​లో జన్మించారు కేశుభాయ్​ పటేల్​. గుజరాత్​ ముఖ్యమంత్రిగా తొలిసారి 1995లో బాధ్యతలు చేపట్టారు​. ఆ తర్వాత 1998 నుంచి 2001 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. గుజరాత్​ అసెంబ్లీకి ఆరు సార్లు ఎన్నికయ్యారు. 1980 నుంచి భాజపాలో ఉన్న ఆయన.. 2012లో రాజీనామా చేసి గుజరాత్​ పరివర్తన్​ పార్టీ పేరుతో సొంత పార్టీ పెట్టారు. చివరిసారిగా 2012లో విసవదార్​ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు​. కానీ.. ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల 2014లో రాజీనామా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: