భారత్​లోని లద్దాఖ్​ ప్రాంతాన్ని చైనా భూభాగంలో చూపటంపై.. పార్లమెంటరీ సంయుక్త కమిటీ(సమాచార భద్రత)కి మౌఖికంగా క్షమాపణలు తెలియజేసింది ట్విట్టర్​.లద్దాఖ్​ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ.. లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, ఈ విషయంపై అఫిడవిట్​ను సమర్పించాలని బుధవారం ట్విట్టర్​ను ఆదేశించింది. ప్రస్తుతానికి మౌకికంగా క్షమాపణలు తెలిపిన ట్విట్టర్​... తమ సంస్థ భారత దేశ సున్నితమైన అంశాలను గౌరవిస్తుందని పునరుద్ఘాటించింది.


ఈ నెల 19న జరిపిన ఓ లైవ్​ బ్రాడ్​కాస్ట్​లో.. లద్దాఖ్​ను చైనాలో భాగంగా చూపించింది ట్విట్టర్​. ట్విట్టర్​ వైఖరిపై భారత ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దిద్దుబాటు చర్యలకు సామాజిక మాధ్యమ దిగ్గజం ఉపక్రమించినా అప్పటికే దుమారం చెలరేగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: