జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోజువారీ కూలీలతో పనికి వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడింది. ప్రయాణికుల్లో ఒకరు మరణించగా.. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరూరు మండలం యములోనిపల్లి గ్రామం నుంచి కూలీలతో వెళ్తున్న ఓ ఆటో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద పందిని గుద్ది బోల్తా పడింది. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రంగా గాయాలవ్వగా.. ఒకరు మరణించారు. కాగా, ఆటోడ్రైవర్ ఆటోలో ఏకంగా 25 మంది ప్రయాణికులను ఎక్కించుకుని వచ్చాడని సమాచారం. దీని వల్లనే పందిని గుద్ది అదుపు తప్పి కింద పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: