పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరూరు మండలం యములోనిపల్లి గ్రామం నుంచి కూలీలతో వెళ్తున్న ఓ ఆటో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద పందిని గుద్ది బోల్తా పడింది. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రంగా గాయాలవ్వగా.. ఒకరు మరణించారు. కాగా, ఆటోడ్రైవర్ ఆటోలో ఏకంగా 25 మంది ప్రయాణికులను ఎక్కించుకుని వచ్చాడని సమాచారం. దీని వల్లనే పందిని గుద్ది అదుపు తప్పి కింద పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరూరు మండలం యములోనిపల్లి గ్రామం నుంచి కూలీలతో వెళ్తున్న ఓ ఆటో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద పందిని గుద్ది బోల్తా పడింది. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రంగా గాయాలవ్వగా.. ఒకరు మరణించారు. కాగా, ఆటోడ్రైవర్ ఆటోలో ఏకంగా 25 మంది ప్రయాణికులను ఎక్కించుకుని వచ్చాడని సమాచారం. దీని వల్లనే పందిని గుద్ది అదుపు తప్పి కింద పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.