ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ అదరగొట్టింది. అబుదాబి వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నాలుగు వికెట్లకు 185 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆరంభంలో లైఫ్ లభించిన క్రిస్‌ గేల్ (99; 63 బంతుల్లో, 6×4, 8×6) విధ్వంసం సృష్టించాడు. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్‌ 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


బెన్‌ స్టోక్స్‌ (50; 26 బంతుల్లో, 6×4, 3×6), సంజు శాంసన్‌ (48; 25 బంతుల్లో, 4×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' స్టోక్స్‌కు లభించింది. ఈ విజయంతో రాజస్థాన్‌ 12 పాయింట్లతో అయిదో స్థానానికి ఎగబాకింది.ఛేదనకు దిగిన రాజస్థాన్‌కు గొప్ప ఆరంభం లభించింది. ఇన్నింగ్స్‌ ఆది నుంచే ఓపెనర్‌ స్టోక్స్‌ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ 24 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: