టర్కీ మెట్రోపాలిటన్‌ నగరం ఇజ్మిర్‌లో భూకంపం కారణంగా భవనాలు కూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. 700 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. టర్కీ, గ్రీస్‌ దేశాల్లో భూకంపం కారణంగా సునామీ సంభవించింది.


ఏజియన్‌ సముద్రంలో రిక్టర్‌ స్కేలుపై 7 తీవ్రతతో ఈ భూంకంపం వచ్చినట్లు టర్కీ డిజాస్టర్‌ అండ్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. భూకంపం కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. చిన్నపాటి సునామీతో సముద్రపు నీరు వీధుల్లోకి రావడం కనిపించింది. కొన్ని చోట్ల భవనాలు కుప్పకూలగా.. వాహనాలు ధ్వంసమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sea