గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ చిత్రపటానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రెండు రోజుల గుజరాత్​ పర్యటన నిమిత్తం అహ్మదాబాద్​ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తొలుత కేశూభాయ్​ నివాసానికి వెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పటేల్​ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.


కరోనా వ్యాప్తి తర్వాత తొలిసారి సొంత రాష్ట్రంలో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానితో పాటు ఆయన మంత్రివర్గం మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా నిర్వహించే ఐక్యతా దినోత్సవం పరేడ్‌లో మోదీ పాల్గొననున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: