గుజరాత్​లోని నర్మదా జిల్లా కేవడియాలో సర్దార్​ పటేల్ జంతుప్రదర్శన శాలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.అనంతరం 'జంగిల్ సఫారీ'లో కాసేపు విహరించారు మోదీ. పక్షులతో కాసేపు కాలక్షేపం చేశారు.ఆయనతోపాటు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, గవర్నర్ ఆచార్య దేవవ్రత్​ ఉన్నారు.


ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్​లో 'ఆరోగ్య వన్​' అనే ఔషధ మొక్కలు, మూలుకల వనాన్ని శుక్రవారం ప్రారంభించారు. గుజరాత్ పర్యటలనో భాగంగా.. ఐక్యతా విగ్రహానికి సమీపంలోని కేవడియా గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ వనాన్ని మోదీ సందర్శించారు.17 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న ఆరోగ్య వన్​లో.. మానవాళి ఆరోగ్యానికి అవసరమైన ఔషధ మొక్కలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వనంలో ఎంపిక చేసిన 380 జాతుల మొక్కలను పెంచినట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: