కర్ణాటక బెంగళూరులో ట్రాఫిక్ నిబంధనలను లెక్క చేయకపోవడం అలవాటుగా మారిన ఓ వ్యక్తికి ఏకంగా రూ.42వేల 500 జరిమానా విధించారు పోలీసులు.బెంగళూరులో శుక్రవారం సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్​ పోలీసులు.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అరుణ్​ కుమార్​ను ఆపారు. అతడిపై అప్పటికే 77 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉన్నట్లు గుర్తించి రూ.42,500 జరిమానా విధించారు. 2 మీటర్ల పొడవున్న ఆ చలానాను అతనికి అందజేశారు. రూ.20వేలతో అరుణ్ కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ స్కూటీని జప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.


ద్విచక్ర వాహనదారులకు కర్ణాటక రవాణా శాఖ హెచ్చరికలు చేసింది. హెల్మెట్‌ ధరించకపోతే మూడు నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తాత్కాలికంగా రద్దు చేస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు ఈ నెల 16 తేదీతో రవాణా శాఖ కమిషనర్‌ అన్ని ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు, సహాయ అధికారులకు రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: