రైతులకు పోలీసులు సంకెళ్ళు వేయడంపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక నేడు చలో గుంటూరు జైలు కార్యక్రమంకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. రాజధాని రైతులకు బేడీలు వేయడం పై చలో జైలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా లో టిడిపి, సిపిఐ , అమరావతి జేఏసి నేతల హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు , టిడిపి ఇన్ చార్జ్ లు కోవెలమూడి రవీంద్ర, నసీర్ లను హౌస్ అరెస్ట్ చేసారు.

ఇక ప్రకాశం జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ చలో గుంటూరు కార్యక్రమం నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్న పోలీసులు.. బయటకు రానీయకుండా వారి అనుచరులను కూడా కట్టడి చేసారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ లను టీడీపీ కార్యాలయంలో నిర్బంధించారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలను అరెస్ట్ లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: