ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల రెండో తేదీ నుంచి డిగ్రీ, పీజీ తరగతుల నిర్వహాణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు యూనినర్శిటీలు, కళాశాలల్లో తీసుకోవాల్సిన కరోనా జాగ్రత్తలపై గైడ్ లైన్స్ జారీ చేసింది. యూనివర్శీటలకు.. కాలేజీలకు అకడెమిక్  క్యాలెండర్ విడుదల చేసింది. వారంలో ఆరు రోజుల పాటు తరగతులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఏ రోజైనా పని దినాల్లో శెలవు  ఇవ్వాల్సి వస్తే దానికి బదులుగా శెలవు దినాలు, రెండో శనివారాలు, ఆదివారాల్లో క్లాసులు నిర్వహించాలని సూచనలు చేసింది.

క్లాస్ రూమ్స్, క్యాంటీన్లు, జిమ్ వంటి ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. హాస్టళ్లల్లోనూ కరోనా వైరస్ నివారణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. హాస్టళ్లను ఒకటో వంతు విద్యార్ధులను మాత్రమే అనుమతించాలని ఆదేశాల్లో పేర్కొంది. కామన్ హాల్స్.. టీవీ హాల్సును వసతి కోసం వివియోగించుకోవాలని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: