దుబ్బాక ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనే ఆసక్తి అందరిలో కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను చాలా వరకు కూడా సీరియస్ గా తీసుకున్నాయి రాజకీయ పార్టీలు. ఇక తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్దిపేట  జిల్లాలో... దుబ్బాక టి ఆర్ ఎస్ నాయకుల ఇండ్లల్లో పోలీసుల సోదాలు నిర్వహించారు. ఏక కాలం లో 8 మంది టి ఆర్ ఎస్ నాయకుల ఇండ్ల లో సోదాలు జరిపారు.

దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి ,  ఎంపీపీ పుష్ప లత కిషన్ రెడ్డి , దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు , ఆర్య వైశ్య సమాజ అధ్యక్షుడు చింత రాజు , సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు , సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి , కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి ,సిద్దిపేట పట్టన పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు.. ఈ సోదాల్లో ఎవరి ఇంట్లో కూడా ఏమి దొరకలేదు అని పోలీసులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: