తెలంగాణా సిఎం కేసీఆర్ నేడు బిజీ బిజీగా గడపనున్నారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్  పర్యటన వివరాలను అధికారులు విడుదల చేసారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను  సిఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. 12:00 గంటలకు జనగామ జిల్లా కొడకండ్ల గ్రామానికి కేసీఆర్ వెళ్తారు. 12:10 నివిుషాలకు కొడకండ్లలో రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు.

12:20 నివిుషాలకు సిఎం కేసీఆర్  పల్లె ప్రకృతి వనంను స్వయంగా పరిశీలిస్తారు. కొడకండ్ల మండలంలోని రామవరం గ్రామంలో వైకుంఠ దామం, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించనున్న సీఎం కేసీఆర్... ఈ సందర్భంగా ఆయన అధికారులతో చర్చిస్తారు. కొడకండ్లలో 5000 మంది రైతులతో సభ నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి వెళ్తారు. దీనితో అధికారులు ఎక్కడికక్కడ చాలా వరకు జాగ్రత్తగా భద్రత చర్యలు ఏర్పాటు చేసారు. ఆందోళనలు చేసే వారికి నోటీసులు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: