భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తన 36 వ  వర్ధంతి సందర్భంగా శక్తి స్తల్ వద్ద మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి నివాళులర్పించారు. రాహుల్, ప్రియాంక నేడు ఉదయమే అక్కడికి చేరుకున్నారు.

కాంగ్రెస్ నేతలు అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో నివాళులు అర్పిస్తున్నారు. ఇందిరా గాంధీ చేసిన సేవలను సోషల్ మీడియాలో కూడా కొనియాడుతున్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళగా ఇందిరా గాంధీ నిలిచిన సంగతి తెలిసిందే. బిజెపి నేతలు కూడా పలు ప్రాంతాల్లో నివాళులు అర్పించడం విశేషం. దీనిపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: