ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పోతిరెడ్డి పాడు వద్ద నిర్మించే రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇటీవల ఈ ప్రాజెక్ట్ ని గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసారు.

గతంలో మహానేత వైఎస్సార్ సిఎంగా ఉండగా జలయజ్ఞం ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించినట్టుగానే సీమ ఎత్తి పోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు మొదలు పెట్టాడు చంద్రబాబు అని ఆయన ఆరోపణలు చేసారు. ట్రిబ్యునల్స్, కోర్టుల్లో కేసులు వేయించి అనుమతులను అడ్డుకోవాలని చూస్తే ప్రజల ఉసురు తప్పక తగులుతుంది అని ఆయన హెచ్చరించారు. కాగా ఇటీవల దీనికి సంబంధించిన తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణా ఈ ప్రాజెక్ట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: