పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఇటీవల కొంత మంది వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి కేంద్రం మరో షాక్ కూడా ఇచ్చింది. ఇక ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి కొన్ని వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆయన వ్యాఖ్యలను రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఖండించారు.

పోలవరంపై ఉండవల్లి వ్యాఖ్యలు అర్థరహితం అని ఆయన ఆరోపించారు. పోలవరంపై జగన్ పోరాటం చేయడం లేదు అనే ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. పోలవరం ప్రాజెక్టుపై రాజీలేని పోరాటం చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు.వచ్చే ఏడాదిలోగా ఆర్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేస్తాం అని భరత్ అన్నారు.  కేంద్రంపై వ్యతిరేకతతో వెళ్తే సాధించేది ఏమీ లేదు అని మార్గాని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: