ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాసారు. పోలవరంపై ఏడు పేజీల లేఖను ఆయన కేంద్రానికి రాసారు. ఇరిగేషన్, భూసేకరణ, పునరావాసానికి నిధులు ఇవ్వాలి అని ఆయన కేంద్రాన్ని కోరారు. పోలవరం నిధుల విషయంలో మీరు జోక్యం చేసుకోవాల్సిందే అని ఆయన పేర్కొన్నారు. 2014 ఏప్రిల్ 29 కేబినేట్ తీర్మానాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు.

కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం 20 వేల కోట్లు మాత్రమే ఇస్తామని ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ నిధుల విషయంలో కేంద్రం వైఖరిని తప్పుబడుతూ ఏపీలో రాజకీయ పక్షాలు అన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఈ తరుణంలో జగన్... ప్రధానికి లేఖ రాయడంతో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: