ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మధ్య కాలంలో కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సోము  మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ కుమార్తెకు దేశంలోనే అత్యంత ముఖ్యమైన పదవిని కట్టబెట్టి బీజేపీలో తగిన గుర్తింపును ఇచ్చాం అని ఆయన పేర్కొన్నారు. సిఎం జగన్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినవారి పై కేసులు పెడితే వారికి బీజేపీ అండగా ఉంటుంది అని ఆయన హామీ ఇచ్చారు.

ఒక కోడి గుడ్డు మీదే ఏడాదికి 2400 కోట్లు వైసిపి నేతలు దోచుకుంటున్నారు అని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల అవినీతికి పాల్పడుతుంది అని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు టీడీపీ కి అధ్యక్షుడా.... చంద్రబాబు నాయుడు  కుటుంబానికి అధ్యక్షుడా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ చేస్తున్న అవినీతిని బీజేపీ వదలదు అని సోము వీర్రాజు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: