రక్షణ కల్పించాల్సిన పోలీసు కానిస్టేబులే ఆ చిన్నారి పాలిట క్రూరమృగంలా మారాడు. ఏడాదిన్నర పాప అని కూడా చూడకుండా సిగరెట్‌తో శరీరంపై పలు చోట్ల వాతలు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బలోద్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లా పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా అవినాష్ రాయ్ సివ్ని విధులు నిర్వహించేవాడు. కాగా అతడు అదే ప్రాంతంలో ఉండే ఒక మహిళకు కొంత డబ్బులు అప్పు ఇచ్చాడు. ఆమె భర్త నాగ్‌పూర్‌లో ఉండేవాడు. కాగా గత నెల ఆ కానిస్టేబుల్‌ను దుర్గ్‌కు బదిలీ చేశారు. ఈ నెల 24న అవినాష్‌ డబ్బుల కోసం ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. డబ్బులు ఇవ్వలేని ఆమె పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఐదు రోజులపాటు ఆమె ఇంట్లోనే ఉండి తల్లీబిడ్డలను చిత్రహింసలు పెట్టాడు.

కాగా గురువారం రాత్రి అతను ఆ మహిళను బాగా కొట్టి.. అనంతరం ఆమె ఏడాదిన్నర పాపను దగ్గరికి తీసుకుని తనను నాన్న అని పిలవాలన్నాడు. దానికి ఆ చిన్నారి స్పందించకపోవడం వల్ల కాలుస్తున్న సిగరెట్‌తో ఆ పాప ముఖం, పొట్ట, చేతులపై కాల్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌ అవినాష్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం అతడ్ని అరెస్ట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: