టీం ఇండియా ఫస్ట్ టెస్ట్ కెప్టెన్ సీకే నాయుడు జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. క్రికెట్ అంటే మక్కువ చూపని భారతీయులు బహు అరుదుగా ఉంటారు అని అన్నారు. నేడు అధిక సంఖ్యాక భారతీయ యువత క్రికెట్ అంటే మైమరచిపోతారు అని అన్నారు. మన జీవితాలపై ఇంతటి ప్రభావాన్ని చూపుతున్న క్రికెట్ అనే పుస్తకానికి  ముఖ చిత్రం మన తెలుగు బిడ్డడే అన్నారు.

ఆయనే సి.కె.నాయుడు గా ప్రసిద్ధి చెందిన కొఠారి  కనకయ్య నాయుడు అని ఆయన కొనియాడారు.  ఆయన  మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణంలో తెలుగు కుటుంబంలో జన్మించారని ఆయన పేర్కొన్నారు.  నేడు ఆయన 125వ జయంతని, ఆయన తాత ముత్తాతలు కృష్ణా జిల్లా మచిలీపట్టణం నుంచి మహారాష్ట్రకు వలస వెళ్లారని పేర్కొన్నారు.  నాయుడు గారి జయంతి సందర్భంగా నా తరపున, జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నా అన్నారు.  భారత టెస్ట్ క్రికెట్ కు ఆయన తొలి కెప్టెన్ కావడం మన తెలుగువారందరికీ గర్వ కారణమని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: