తాళి కట్టే సమయంలో ఆపండి అనే మాటను మనం ఎక్కువగా సినిమాలోనే చూసి ఉంటాం. కానీ నిజ జీవితంలోనూ అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వధువు సరిగ్గా తాళి కట్టే సమయానికి వరుడికి షాక్ ఇచ్చింది. తమిళనాడు నీలగిరి జిల్లా కోతగిరిలో నివాసముంటున్న ప్రియదర్శినికి నీలగిరి జిల్లాకే చెందిన ఓ వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించారు ఇరువురి కుటుంబసభ్యులు. వివాహ వేడుకలో వరుడు తాళి కట్టే సమయంలో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను ప్రేమించిన వాడు అరగంటలో వస్తాడని చెప్పడంతో వరుడు ఖంగుతిన్నాడు. ఆమె ఏం చెబుతుందో అర్థం కాక చుట్టూ వున్న బంధువుల వైపు చూశాడు.

ఇక బంధువుల జోక్యం చేసుకుని వధువుకు సర్ది చెప్పబోతే ఆమె ససేమిరా అన్నది. అయితే ఆ వివాహానికి హాజరైయిన ఓ పెద్దావిడ మరికొంత జోక్యం చేసుకుని వధువుని నాలుగు దెబ్బలేసైనా ఒప్పిద్దాం అనుకుంది. కానీ వధువు ఆ పెద్దావిడకు ఎదురు తిరిగింది. ఈ తంతు కొనసాగుతుండగానే ఎటూ తోచని వరుడు వివాహ వేడుక నుంచి వెళ్ళిపోయాడు. కుటుంసభ్యులు ఎంతగా వారించిన ప్రియదర్శిని మాట వినకపోవడంతో పెళ్లి వద్దంటూ వివాహ వేడుక నుండి వెళ్లిపోయాడు వరుడు. పెళ్లి ఆగిన తరువాత ఎంతసేపటికి ప్రియదర్శిని ప్రేమించిన వ్యక్తి రాకపోవడంతో వధువుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు కుటుంబసభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: