డిఫెండింగ్‌ ఛాంపియన్‌  ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండ్‌షోతో  అదరగొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసిన ముంబై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ 51వ మ్యాచ్‌లో ఢిల్లీ నిర్దేశించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. కేవలం 14.2 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పై 9 వికెట్ల భారీ తేడాతో గెలుపొందింది.

ఇషాన్‌ కిషన్‌(72 నాటౌట్:‌ 47 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడంతో ముంబై అలవోకగా విజయం సాధించింది. క్వింటన్‌ డికాక్‌(26), సూర్యకుమార్‌ యాదవ్‌(12 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. అంతకుముందు  బుమ్రా(3/17), ట్రెంట్‌ బౌల్ట్‌(3/21)  దెబ్బకు  ఢిల్లీ  20 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులకే  కుప్పకూలింది.  ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(25), రిషబ్‌ పంత్‌(21) మాత్రమే కొంతసేపు పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌ బెర్తు దక్కించుకోవాలని భావించిన ఢిల్లీకి నిరాశే ఎదురైంది. కీలక పోరులో  బ్యాట్స్‌మెన్‌ సమిష్టి వైఫల్యంతో ఓటమి చవిచూసింది. 18 పాయింట్లతో ముంబై అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: