సిరిసిల్ల జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరి ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్ళింది. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య అంతర్గత పోరు తార స్థాయికి చేరింది. అధికార పార్టీ ఛైర్ పర్సన్, వైస్ చైర్మన్‌ల మధ్య శనివారం తలెత్తిన ప్రోటో కాల్ వివాదం తిట్టుకొని, చివరకు తన్నుకొనే వరకూ వెళ్లింది. సర్దార్ వల్లభ్‌భాయ్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పూలమాలలు వేసే క్రమంలో ప్రోటో కాల్ పాటించాలని వైస్ ఛైర్మన్ పార్టీ చైర్ పర్సన్ తో వాగ్వాదానికి దిగాడు.

 దీంతో అప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు అసభ్య పదజాలంతో ఒకరినొకరు నెట్టేసుకుంటూ ఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న మరికొంత మంది కౌన్సిలర్లు అపేందుకు యత్నించినా ఆగలేదు. అక్కడితో ఆగకుండా మాదంటే మాదే టీఆర్‌ఎస్‌ అంటూ నినాదాలు చేశారు.అయితే, కొంత కాలంగా మున్సిపల్‌లో చైర్మన్ రామ తీర్థపు మాధవి భర్త రాజుకు, వైస్ చైర్మన్ మధు రాజేందర్‌కు విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గతంలో ఎమ్యెల్యే దృష్టికి వెళ్లినా ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. ప్రజలకు సేవ చేయాల్సిన కౌన్సిలర్లు కొట్లాడుకోవడం, అందులోనూ ఇద్దరూ అధికార పక్ష నాయకులు ఘర్షన పడడం ఆశ్చర్యకరంగా మారింది.

ఇక దీనిపై స్థానిక ఎమ్యెల్యే రమేష్ బాబు, జిల్లా మంత్రి కేటీఆర్‌ స్పందించాల్సి ఉంది. వాళ్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. టిఆర్ఎస్ పార్టీలో దాదాపుగా ఎక్కువశాతం కొందరి నాయకుల్లో ఇలాంటి ప్రతిష్టంభన ఏర్పడటం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే పార్టీలో ఈ లొసుగులను కెసిఆర్ వరకు వెళ్తున్నాయో లేదో కానీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మితిమీరిపోతున్నాయి దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి పెడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఇ దీనిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్న అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: