ఇటీవల వర్షాలతో హైదరాబాదు ఎంతలా అతలాకుతలం అయ్యిందో తెలిసిందే. నగరంలో  ఎటు చూసినా వరదలతో కాలనీలు అన్ని నిండిపోయాయి. అటువంటి దీన పరిస్థితుల్లో హైదరాబాద్ ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ఘాటు విమర్శలు చేశారు. ఇదే విషయం పైన హైదరాబాద్‌లో వరద సాయం అందుతున్న తీరుపై సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లేఖలో టీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రేటర్‌ హైదరాబాదులో ఓట్లు కోసం ప్రభుత్వం అనేక కుంభకోణాలకి కారణంగా క‌న‌ప‌డుతోందని అన్నారు.

చిత్తశుద్ధి ఉంటే వరద పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేసేవారని ఆయన అన్నారు. మీ అత్యుత్సాహం వల్ల పరిహారం నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రెండు రోజుల్లో తిరిగి ప‌రిహారం పంపిణీ చేయాల‌ని రేవంత్ డిమాండ్ చేశారు. ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన దోపిడిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాల‌ని, లేదంటే క్షేత్రస్థాయి ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.గ్రేటర్‌లో వరద సాయాన్ని గులాబీ గద్దలు స్వాహా చేశాయి. శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా వరద బాధితుల సాయంలోనూ కమీషన్ల కోసం పోట్లాడు తున్నారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

మీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులను చూస్తే వీళ్లు మనుషులేనా, అసలు మీకు మానవత్వం ఉందా అనిపిస్తోంది. గ్రేటర్‌లో ఓట్లు దండుకోవాలన్న మీ దుర్భుద్ధే ఈ స్కాంకు కారణం. చిత్తశుద్ధి ఉంటే పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేసేవారు. మీ అత్యుత్సాహం వల్ల పరిహారం నిలిపేయాల్సిన పరిస్థితి. రెండు రోజుల్లో తిరిగి పరిహారం పంపిణీ మొదలు పెట్టాలి. ఇప్పటి వరకు జరిగిన దోపిడీపై తప్పనిసరిగా విజిలెన్స్ విచారణ చేపట్టాలి’ అని లేఖలో రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మరి రేవంత్ రెడ్డి రాసిన ఈ లేఖపై టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: