డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి విజయ పరంపర కొనసాగిస్తోంది. దుబాయ్‌ వేదికగా శనివారం జరిగిన 111 పరుగుల లక్ష్యాన్ని 14.2 ఓవర్లలో ఛేదించింది. ఇషాన్‌ కిషాన్‌ (72 నాటౌట్) అజేయ అర్థశతకంతో చెలరేగి విజయంలో కీలకపాత్ర పోషించాడు.స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఓపెనర్లు ఇషాన్‌, డికాక్‌ (26) దిల్లీకి అవకాశం ఇవ్వలేదు. తొలుత వికెట్‌ పడకుండా నిదానంగా ఆడిన ఈ జోడీ.. తర్వాత దూకుడు పెంచింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 


దీంతో 10 ఓవర్లలో ముంబయి 68 పరుగులు చేసింది. అయితే డికాక్‌ను నోర్జె ఔట్‌ చేసి, ఢిల్లీకి కాస్త ఊరట కలిగించాడు. కానీ ఇషాన్‌ మరింత చెలరేగాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (12*)తో కలిసి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో అర్థశతకం చేశాడు. నోర్జె బౌలింగ్‌లో సిక్సర్‌ బాది జట్టుకు విజయాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: