బెంగళూరుపై హైదరాబాద్​ ఘన విజయం సాధించింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో 5 వికెట్లు కోల్పోయి, 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు.. ప్రారంభం నుంచి తడబడింది. సన్​రైజర్స్​ బౌలర్ల ధాటిగా పరుగులు చేయడానికి కష్టపడింది. మరోవైపు వికెట్లు కూడా కోల్పోయారు.


ఆర్సీబీ బ్యాట్స్​మెన్​లో ఫిలిప్పీ(32), దేవదత్​(5), కోహ్లీ(7), డివిలియర్స్(24), సుందర్(21), గుర్​కీరత్ సింగ్(15), మోరిస్(3), సిరాజ్(2) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. సన్​రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్ తలో రెండు వికెట్లు.. రషీద్ ఖాన్, నటరాజన్, రషీద్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదన మొదలుపెట్టిన హైదరాబాద్.. ధాటిగా ఇన్నింగ్స్​ ఆరంభించింది. అయితే ఓపెనర్ వార్నర్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన మనీశ్ పాండే(26).. మరో ఓపెనర్ సాహా(39)తో కలిసి నెమ్మదిగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: