మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదాస్పద ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు లేఖలు రాశారు మరాఠీ మంత్రులు ఏక్​నాథ్ శిందే, ఛాగన్​ భజ్​బుల్​. బెల్గాం ప్రాంతాన్ని తమ రాష్ట్రంలో కలుపుకొనేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 6 దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ వివాదం త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కర్ణాటకలో భాగంగా ఉన్న బెల్గాం, కర్వార్, నిప్పాని ప్రాంతాలు తమవని మహారాష్ట్ర చెబుతోంది. అక్కడ అధిక మంది మరాఠీ భాష మాట్లాడతారని, ఆ ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలపాలని ఎన్నో ఏళ్లుగా వాదిస్తోంది.


ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఏక్​నాథ్ శిందే, ఛాగన్​ భజ్​బుల్​లను సమన్వయకర్తలుగా నియమించారు సీఎం ఉద్ధవ్​ ఠాక్రే.ఈ వివాదం నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నివసించే మరాఠీలు నవంబరు 1ని బ్లాక్​డేగా పాటిస్తారు. ఈ ఏడాది ఆ రోజున మహారాష్ట్ర మంత్రులందరూ నల్ల రిబ్బన్లు ధరించి విధులు నిర్వహించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: