పుల్వామా ఉగ్రదాడి సమయంలోనూ కొందరు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారని.. విపక్షాలపై పరోక్షంగా మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమర వీరుల మరణం పట్ల దుఃఖంలో ఉన్న తనను ఎన్నో మాటలన్నారని తెలిపిన మోదీ.. వాటన్నింటినీ సహించినట్టు వెల్లడించారు. సర్దార్​ పటేల్​ జయంతి సందర్భంగా గుజరాత్​ ఐక్యతా విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని.


పుల్వామా ఉగ్రాదాడిని తమ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ ప్రభుత్వ​ విజయంగా అభివర్ణించింది పాకిస్థాన్​. ఆ దేశ పార్లమెంట్​ వేదికగా ఓ మంత్రి ఈ వ్యవహారంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడే వారి నిజస్వరూపం బయటపడిందన్నారు మోదీ. నీచ రాజకీయాలను మానుకోవాలని సర్దార్​ సాక్షిగా అభ్యర్థిస్తున్నట్టు పేర్కొన్నారు మోదీ.

మరింత సమాచారం తెలుసుకోండి: