దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ఇంకా తీవ్ర స్థాయిలో ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) వెల్లడించింది. శనివారం ఉదయం నాటికి పరిస్థితులు తీవ్రస్థాయిలోనే ఉన్నా.. మారుతున్న వాతావరణం వల్ల.. క్రమంగా మార్పు వస్తుందని అంచనా వేసింది. రెండు రోజుల్లో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొంది.గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) ప్రకారం.. శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో 369గా నమోదైంది. శుక్రవారం ఈ రీడింగ్​- 374గా ఉండగా, గురువారం- 369, బుధవారం- 297, మంగళవారం- 312, సోమవారం- 353గా ఉంది. ఢిల్లీలోని పలుప్రాంతాల్లో 400కుపైగా తీవ్ర కాలుష్య నాణ్యత నమోదైంది.


అటు.. ప్రత్యేక కాలుష్య విభాగం(పీఎం)లో శుక్రవారం 2.5 పాయింట్లు(19శాతం) నమోదైందని ఎర్త్​ సైన్సెస్​ ఎయిర్​ క్వాలిటీ మానిటరింగ్​ ఏజెన్సీ(సాఫర్​) తెలిపింది. గురువారం 36శాతానికి చేరిన ఈ సంఖ్య.. గరిష్ఠస్థాయిని నమోదు చేసింది. బుధవారం- 18శాతం, మంగళవారం- 23శాతం, సోమవారం- 16శాతం, ఆదివారం-19 శాతంగా ఉన్నట్టు సాఫర్​ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: