దేశంలోనే తొలి సీ-ప్లేన్​ సేవలను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేవడియాలోని సర్దార్​ సరోవర్​ డ్యాంకు సమీపంలోని పాండ్​-3 నుంచి ఈ ట్విన్​ ఇంజిన్​ విమానా సేవలను జాతికి అంకితం చేశారు.తొలి సీ-ప్లేన్​ ప్రారంభం సందర్భంగా కేవడియా నుంచి సబర్మతి వరకు ప్రయాణించారు ప్రధాని మోదీ.


సుమారు 40 నిమిషాల పాటు 200 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతి చేరుకున్నారు. అంతకు ముందు కేవడియాలోని నీటి విమానాశ్రయం వద్ద కొంత సమయం గడిపారు ప్రధాని. సీ-ప్లేన్​ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.19 మంది ప్రయాణించేందుకు వీలు కలిగిన ఈ విమానం గుజరాత్​ కేవడియా సమీపంలోని ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్​లోని సబర్మతి మధ్య తిరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: