హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో పోలీసులు సీరియస్ గా ఉన్నా సరే కొందరు మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు. వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా సరే జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం లేదు. తాజాగా హైదరాబాద్ లో ఒక ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి వేగంగా వచ్చి క్యాబ్ ను ఢీ కొట్టింది ఒక  బెంజ్  కారు.

ఇండికా కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి అని పోలీసులు మీడియా కు చెప్పారు. ఆసుపత్రికి తరలించారు. బెంజ్ కారులో ముగ్గురు యువకులు, ఇద్దరు అమ్మాయిలు మద్యం తాగి డ్రైవింగ్ చేసారని గుర్తించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసారు. పోలీసులు ఈ ఘటనలపై సీరియస్ గా ఉన్నారు. కఠిన చర్యలకు కూడా దిగే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: